కామారెడ్డి జిల్లాలోని 25 మండలాల్లో ఎంపీటీసీ 233, జడ్పీటీసీ స్థానాలు 25 ఖరారు

కామారెడ్డి జిల్లాలోని 25 మండలాల్లో ఎంపీటీసీ 233, జడ్పీటీసీ స్థానాలు 25 ఖరారు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో 25 మండలాల్లో ఎంపీటీసీ స్థానాలు 233 ఖరారు అయ్యాయి.  గత ఎన్నికల టైంలో 237 ఉండగా, 4 స్థానాలు తగ్గాయి. బిచ్​కుంద మండల కేంద్రాన్ని ఇటీవల ప్రభుత్వం మున్సిపాలిటీగా మార్చింది.  దీంతో ఇక్కడ ఎంపీటీసీ స్థానాలు 4 తగ్గాయి.  గత ఎన్నికప్పుడు  22 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఈసారి 3 పెరిగాయి.  గత అసెంబ్లీ ఎన్నికల ముందు పాల్వంచ, మహమ్మద్​నగర్, డొంగ్లి మండలాలుగా ఏర్పడ్డాయి.  జిల్లాలో అత్యధికంగా 15 ఎంపీటీసీ స్థానాలు గాంధారి మండలంలో ఉన్నాయి.  

భిక్కనూరు,  జుక్కల్, మాచారెడ్డి మండలాల్లో 14 చొప్పున, బాన్సువాడలో 11,  బీబీపేట 8, బిచ్​కుంద10, బీర్కుర్​లో 7, దోమకొండ 9, డొంగ్లిలో 5, కామారెడ్డిలో 6,  మాచారెడ్డిలో 14, మద్నూర్​లో 12, మహమ్మద్​నగర్​లో 5, నాగిరెడ్డిపేటలో 10, నస్రుల్లాబాద్​లో 8, నిజాంసాగర్​లో 5, పాల్వంచలో 6,  పెద్దకొడప్​గల్​లో 7, పిట్లంలో 13,  రాజంపేటలో 8, రామారెడ్డిలో 10, సదాశివనగర్​లో 12, తాడ్వాయిలో 9, ఎల్లారెడ్డిలో 8 స్థానాలు ఉన్నాయి.