
కరీంనగర్ టౌన్,వెలుగు: సిటీలోని భగవతి, ఆర్విన్ ట్రీ స్కూల్లో శుక్రవారం మొదటిసారిగా డిజిటల్ విధానంలో క్యాబినెట్ ఎన్నికలు నిర్వహించినట్లు చైర్మన్ రమణరావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటింగ్, ప్రజాస్వామ్య విధి విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. టీచర్లు, స్టూడెంట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.