హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 24, శుక్రవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 25న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్తో సమావేశమవుతారు. మరుసటి రోజు 26న విజ్జానభవన్లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్తో మాట్లాడుతారు. అనంతరం అదే రోజు సాయంత్రం హైద్రాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు.
కాగా.. రేపటి నుంచి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీ సమావేశాల అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో పాల్గొని ఆ తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే కేసీఆర్ ఢిల్లీ టూర్ మీద ఆయా పార్టీలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
For More News..
హుజురాబాద్లో మంత్రులే లిక్కర్ పంచుతున్నారు
వైరల్ వీడియో: చదువుకుంటూ పేపర్ వేయొద్దా..
ఎమ్మెస్సీ చదివి స్వీపర్ పని.. కేటీఆర్ స్పందన