
BRS ప్రభుత్వంలో కరెంట్ కొనుగోళ్లలో అక్రమాలపై ఏర్పాటైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు వివరణ ఇచ్చారు మాజీ సీఎం కేసీఆర్. మొత్తం 12 పేజీల్లో తన వివరణను కమిషన్ కు పంపారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ కమిషన్ విచారణ పాదర్శకంగా లేదని ఆరోపించారు మాజీ సీఎం కేసీఆర్.
విచారణ పూర్తి కాకుండానే కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టారని చెప్పారు. నిబంధనలకు విరుద్దంగా కమిషన్ వ్యవహరించిందని ఆరోపించారు గులాబీ బాస్. తమకు వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలనేది కమిషన్ ఉద్దేశంగా ఉందని అర్థమైందన్నారు. అసలు ERC తీర్పులపై ఎంక్వైరీ కమిషన్లు వేయొద్దనే విషయం కూడా రేవంత్ ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు కేసీఆర్.