ఢిల్లీలో మరో ప్లాస్మా సెంటర్ ను ప్రారంభించిన  కేజ్రీవాల్

ఢిల్లీలో మరో ప్లాస్మా సెంటర్ ను ప్రారంభించిన  కేజ్రీవాల్

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా రోగుల కోసం రెండో ప్లాస్మా సెంటర్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఇవాళ(మంగళవారం)  ఈ ప్లాస్మా సెంటర్ ను ప్రారంభించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న లోక్ నాయక్ హాస్పటల్  లోఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మొదటి ప్లాస్మా సెంటర్‌ విజయవంతమైందనీ,  అందుకే రెండో సెంటర్‌ను ఎల్‌ఎన్‌జీపీ దగ్గర ఇవాల ప్రారంభించామని తెలిపారు సీఎం కేజ్రీవాల్.