13 స్థానాల్లో ఆప్​ను గెలిపించండి .. పంజాబ్​ ప్రజలకు కేజ్రీవాల్ రిక్వెస్ట్

13 స్థానాల్లో ఆప్​ను గెలిపించండి .. పంజాబ్​ ప్రజలకు కేజ్రీవాల్ రిక్వెస్ట్

చండీగఢ్ :  పంజాబ్‌‌ మరింత అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలోని మొత్తం 13 లోక్‌‌సభ స్థానాల్లోనూ ఆప్​ అభ్యర్థులను గెలిపించాలని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఆ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే జనరల్ ఎన్నికల కోసం కేజ్రీవాల్ సోమవారం మొహాలిలో  ఎన్ని కల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ..మీరు ఆప్‌‌ అభ్యర్థులను ఎంపీలను చేస్తే, వారు లోక్‌‌సభలో మీ సమస్యలపై గళమెత్తుతారు.

ఢిల్లీ నుంచి నలుగురు, హర్యానాలోని కురుక్షేత్ర నుంచి ఒకరితో కలిపి లోక్‌‌సభలో 20 మంది ఎంపీలు అవుతారు. రాజ్యసభలో ఇప్పటికే10 మంది ఎంపీలు ఉన్నారు. ఈ బలంతో ప్రజలకు కావాల్సింది కేంద్రం నుంచి సాధించవచ్చు" అని కేజ్రీవాల్ వివరించారు.