మన దేశంలో చిన్న వయస్సులోనే మేయర్ గా ఎన్నికై ఓ యువతి రికార్డ్ సృష్టించింది. ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ లెప్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్ )విజయం సాధించింది. మొత్తం 14 జిల్లా పంచాయతీలకు గాను 11 జిల్లా పంచాయతీలు, 152 బ్లాక్ పంచాయతీలకు గాను 108 బ్లాక్ పంచాయతీలను , 941 గ్రామ పంచాయతీల్లో 514 పంచాయతీలను కైవసం చేసుకుంది. 6 మున్సిపల్ కార్పొరేషన్లలో ఐదింటిని, 86 మున్సిపాలిటీల్లో 35 మున్సిపాలిటీలను చేజిక్కించుకుంది.
ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ పార్టీ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం ముదువాన్ ముగల్ వార్డ్ కౌన్సిలర్ గా బీఎస్సీ మ్యాథ్స్ స్టూడెంట్ ఆర్యరాజేంద్రన్ విజయం సాధించారు. కౌన్సిలర్ గా విజయం సాధించడంతో అధికార పార్టీ సీపీఎం డిస్ట్రిక్ ప్యానల్ సెక్రటరియేట్ గా నియమించింది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆర్య రాజేంద్రన్ కు మేయర్ గా పదవి వరించింది.
లోకల్ బాడీ ఎన్నికల్లో సీపీఎం విజయం సాధించినా.., మేయర్ పదవి ఎన్నిక ఆ పార్టీకి కత్తిమీద సాములా తయారైంది. పెరూర్కాడ వార్డ్ నుంచి మేయర్ పదవి కోసం సీనియర్ నేత జమీలా శ్రీధరన్ ప్రయత్నించారు. కానీ జమీల శ్రీధరన్ కు వ్యతిరేకత ఏర్పడడంతో..మేయర్ పదవిని పార్టీ యువనేతలకు కట్టబెట్టాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి.
దీంతో పార్టీ అధిష్టానం బీఎస్సీ విద్యార్ధిని ఆర్యా రాజేంద్రన్ కు మేయర్ పదవి కట్టబెట్టింది. ఆర్యా రాజేంద్రన్ తిరువనంతపురంలోని ఎల్బీఎస్ ఇంజినీరింగ్ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. దీంతో పాటు పొలిటికల్ గా యాక్టీవ్ గా ఉంది. ఎస్ ఎఫ్ ఐ స్టేట్ కమిటీ మెంబర్ గా, కేరళ సీపీఎం పార్టీ చిల్డ్రన్ వింగ్ విభాగానికి ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆర్యరాజేంద్రన్ సత్తాచాటారు. జిల్లాలో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు గాను ఐదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించడంలో కీరోల్ ప్లే చేశారు. దీంతో అధికార పార్టీ మేయర్ గా ఆర్య రాజేంద్రన్ ఎంపికయ్యారు. పార్టీ నాకు ఎలాంటి బాధ్యతను అప్పగించినా సమర్ధవంతంగా పనిచేస్తాను. చదువుతో పాటు రాజకీయాల్లో కొనసాగుతూ ప్రజాసమస్యలే పరమావధిగా పనిచేస్తానని మీడియా సమావేశంలో తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే లోయర్ ప్రైమరి స్కూల్స్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని ఆర్యా రాజేంద్రన్ వెల్లడించారు.
దేశంలోనే తొలిసారి : మేయర్ గా 21 ఏళ్ల కాలేజీ విద్యార్ధిని
- దేశం
- December 26, 2020
లేటెస్ట్
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- చెరువుల ఆక్రమణపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..
- ఎండలతో పాటు కరెంట్ బిల్లు పెరుగుతుందా... అయితే ఇలా తగ్గించుకోండి..
- CSK vs LSG : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న లక్నో
- ఏమైందీ : రత్నం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు..క్షమాపణలు చెప్పిన విశాల్..కారణం ఏంటంటే.?
- ఫస్ట్ ఓపెన్ AI ఎంప్లాయిగా ప్రజ్ఞా మిశ్రా..ఎవరీ ప్రజ్ఞా మిశ్రా ?
- నువ్వా..నేనా..దేనికైనా సై.. కడియంకు తాటికొండ సవాల్
- బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కు హైకోర్టులో ఊరట
- జగన్ కుంభకర్ణుడిలా నిద్రపోయి.. ఇప్పుడు నిద్ర లేచాడు..
- కవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీకి సీట్లు అమ్ముకున్నడు : సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- IND vs PAK: పాకిస్థాన్తో టెస్ట్ సిరీస్.. ఆడటానికి సిద్ధమన్న రోహిత్ శర్మ
- వచ్చే వారమే తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు.. ఈ తేదీల్లో రావొచ్చు!
- దావత్ అంటే తాగుడేనా .. తాగితినే దోస్తువురా
- నాగుపాముల కూర.. చూసి వణికిపోయిన నెటిజన్లు