
దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటనపై కీలకాంశాలు ఇలా ఉన్నాయి. ఎనౌ కౌంటర్ పై షాద్ నగర్ ఏసీపీ సురేందర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 307, 224, 394, 332, రెడ్ విత్, 34 ఐపీసీ, 25(1-B)(a) అర్మ్స్ యాక్ట్, 174 రెడ్ విత్ 176 crpc కింద కేస్ నమోదుచేసుకున్నారు పోలీసులు. నిందితులు 19సంవత్సరాల వారిగా గుర్తించినట్లు FIRలో తెలిపారు.
డిసెంబర్ 6 పొద్దున 5:10 నిమిలకు… దిశ వస్తువులను సేకరించడానికి నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లారు చటాన్ పల్లి పోలీసులు. ఘటనా స్థాలనికి చేరుకోగా 6:10 నిమిషాలకు నిందితులు ఒక్కసారిగ పోలీసులపై తిరగబడ్డారని చెప్పారు. వెపన్స్ గుంజుకుని పోలీసులను చంపేందుకు ప్రయత్నించగా.. ఆత్మరక్షణ కోసమే ఎదురు కాల్పులు చెయగా నలుగురు నిందితులు చనిపోయారని పోలీసులు తెలిపారు.