థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌ బ్యాడ్మింటన్ 2024: నిరాశపరిచిన శ్రీకాంత్‌‌‌‌

థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌ బ్యాడ్మింటన్ 2024:  నిరాశపరిచిన శ్రీకాంత్‌‌‌‌

బ్యాంకాక్‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌ షట్లర్‌‌‌‌ కిడాంబి శ్రీకాంత్‌‌‌‌.. థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌ టోర్నీలో నిరాశపర్చాడు. గురువారం జరిగిన మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌లో ఆరోసీడ్‌‌‌‌ శ్రీకాంత్‌‌‌‌ 9–21, 21–13, 17–21తో ఇండియాకే చెందిన క్వాలిఫయర్‌‌‌‌ మిథున్‌‌‌‌ మంజునాథ్‌‌‌‌ చేతిలో ఓడాడు. 54 నిమిషాల మ్యాచ్‌‌‌‌లో శ్రీ స్థాయికి తగ్గ పోరాటం చేయలేకపోయాడు.

మరో మ్యాచ్‌‌‌‌లో శంకర్‌‌‌‌ సుబ్రమణియన్‌‌‌‌ 9–21, 11–21తో లిన్‌‌‌‌ చెన్‌‌‌‌ యు (చైనీస్‌‌‌‌తైపీ) చేతిలో ఓడాడు. విమెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో ట్రిసా జోలీ–గాయత్రీ గోపీచంద్‌‌‌‌ 21–15, 24–22తో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్పపై నెగ్గారు. విమెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో అష్మితా చాలియా 21–12, 15–21, 21–17తో పాయ్‌‌‌‌ యు పో (చైనీస్‌‌‌‌ తైపీ)పై గెలిచింది.