
వెల్లడించిన నైట్ఫ్రాంక్ న్యూఢిల్లీ: మనదేశంలోని ఎనిమిది ప్రధాన రెసిడెన్షియల్మార్కెట్లలో జూలై–-సెప్టెంబర్ క్వార్టర్లో అమ్మకాలు ఒక శాతం మాత్రమే పెరిగాయి. డిమాండ్ మందగించినట్లు ఎలాంటి సంకేతాలు లేనప్పటికీ, రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు డిమాండ్ మున్ముందు పెరుగుతుందని రియల్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ మంగళవారం (అక్టోబర్ 07) తెలిపింది.
రిపోర్టు ప్రకారం.. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరం మూడో క్వార్టర్లో ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇండ్ల అమ్మకాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 1 శాతం పెరిగి 87,603 యూనిట్లకు చేరాయి. వడ్డీ రేట్లు తగ్గడం, ఆర్థిక వృద్ధి, పన్ను రాయితీలు అమ్మకాల ఊపును కొనసాగించాయి.
ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ఎనిమిది ప్రధాన నగరాల్లోని అమ్మకాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఒక శాతం తగ్గి 2,57,804 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ ఎనిమిది నగరాల్లో ఢిల్లీ-–ఎన్సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణే, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, కోల్కతా, అహ్మదాబాద్ ఉన్నాయి.