
తిరుమల శ్రీవారికి భక్తులు అనేక విధాలుగా భక్తులు సమర్పించుకుంటారు. ధనము.. బంగారం.. వెండి.. ఇంకా అనేకంగా ముడుపులు కట్టి సమర్పిస్తుంటారు. కాని తిరుపతి సమీపంలోని కొప్పెరవాండ్లపల్లెకు ఓ కుటుంబం హుండీని బహుకరించింది. ఇలా స్వామికి సమర్పించడం వంశపారపర్యంగా వస్తుందని కొప్పెర వంశస్తులు తెలిపారు.
తిరుమల శ్రీవారికి శుక్రవారం ( అక్టోబర్ 17) కొప్పెర హుండీ విరాళంగా అందింది. తిరుపతి సమీపంలోని కొప్పెరవాండ్లపల్లెకు చెందిన కొప్పెర సాయిసురేష్ ఈ హుండీని ఆలయంలో పోటు పేష్కార్ మునిరత్నంకు అందించారు.
రాగి, ఇత్తడితో కలిపి తయారుచేసిన ఈ హుండీ బరువు 70 కిలోలు ఉంటుంది. దీని విలువ రూ.2.50 లక్షలని దాత తెలిపారు. తాము 1821 సంవత్సరం నుండి వంశపారంపర్యంగా స్వామివారికి కొప్పెర హుండీలు సమర్పిస్తున్నామని వెల్లడించారు.దీని తయారీకి దాదాపు 20 రోజులు పడుతుందని చెబుతున్నారు.