విపత్తులోనూ చిల్లర రాజకీయాలా?.. బీఆర్ఎస్ పై కోట నీలిమ ఫైర్

విపత్తులోనూ చిల్లర రాజకీయాలా?.. బీఆర్ఎస్ పై కోట నీలిమ ఫైర్

పద్మారావునగర్, వెలుగు: విపత్తుల సమయంలో ఎలా స్పందించాలో తెలియని స్థితిలో బీఆర్​ఎస్​ నాయకులు ఉన్నారని, సాయం చేయడానికి వచ్చే వారిని అడ్డుకోవడం వారి చిల్లర రాజకీయానికి నిదర్శనమని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇన్​చార్జి కోట నీలిమ అన్నారు. శుక్రవారం ఆమె ట్రాఫిక్​ పోలీస్​ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి అండర్​ పాస్​ బ్రిడ్జి వద్ద పర్యటించారు. 

హైదరాబాద్​లో వరద సమస్యకు చెక్​ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందన్నారు. భారీ వర్షాల సమయంలో హైడ్రా అధికారులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని కొనియాడారు. బల్కంపేట అండర్​పాస్​ బ్రిడ్జి కింద వచ్చిన వరదల్లో ఇటీవల యువకుడు మృతిచెందడం బాధాకరమన్నారు. 

వరదల్లో చిక్కుకున్న జనాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు బీఆర్​ఎస్​ కార్యకర్తలు అడ్డుపడడం సరికాదన్నారు. వారి తీరుతో సేవలకు అంతరాయం కలుగుతోందన్నారు.