కాగజ్ నగర్, వెలుగు: ఇన్వర్టర్ లేకపోవడంతో సెల్ఫోన్ టార్చ్ లైటు వెలుతురులో డాక్టర్లు ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తుమిడిహెట్టికి చెందిన నాగపురి లవ్ కుశ్ అనే యువకుడిని మంగళవారం సాయంత్రం పాము కాటు వేసింది. కుటుంబీకులు కౌటాల పీహెచ్ సీకి తీసుకెళ్లారు.
సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఇన్ పేషెంట్ వార్డులో డాక్టర్ పవన్ కల్యాణ్, స్టాఫ్ నర్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇదే సమయంలో కరెంటు పోయింది. ఇన్వెర్టర్ లేకపోవడంతో పేషెంట్ వెంట వచ్చిన వాళ్లు సెల్ ఫోన్లలో టార్చ్ లైట్లను ఆన్ చేశారు.
ఆ వెలుతురులో బాధితుడికి ఇంజక్షన్ ఇచ్చి కాగజ్నగర్కు రిఫర్ చేశారు. ఇదే సమయంలో చింతల మానేపల్లి మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన మెస్రం సునీత పురిటి నొప్పులతో వచ్చింది. ఆమెకు కూడా సెల్ ఫోన్ వెలుతురులోనే ట్రీట్మెంట్ అందించారు. కరెంటు వచ్చిన కొద్దిసేపటికే ఆమె బాత్ రూమ్ కు వెళ్లి అక్కడే డెలివరీ అయి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
