
పాల్వంచ, వెలుగు : మండలంలోని కేపీ జగన్నాథపురంలో ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో పాత షాపింగ్ కాంప్లెక్స్ లో రెండవ నెంబర్ దుకాణం వేలంపాటలో రూ.1,20,500 ధర పలికింది. ఇదే దుకాణం గత ఏడాది 60 వేలు ఉండగా ఈసారి పాల్వంచకు చెందిన ఎం.కృష్ణవేణి దక్కించుకున్నారు కాగా ఆలయ ఆధీనం లోని రెండు ఫంక్షన్ హాల్స్ కు సరైన పాట రాకపోవడంతో వాయిదా వేశారు. షాపింగ్ కాంప్లెక్స్ లోని పలు దుకాణాలు ఫొటోలకు, తలనీలాలు, చీరలు ప్రోగుచేసే టెండర్, పూలదండలు తదితర వేలం పాటలకు భారీగా దరఖాస్తు చేసుకున్నారు.
ఆలయ ఈవో రజనీకుమారి, మణుగూరు ఉమా సోమలింగేశ్వర స్వామి ఆలయ ఈవో వీఎల్వీవెంకటరావు పర్యవేక్షణలో ఈ టెండర్లు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆలయ పాలక మండలి చైర్మన్ బాలినేని నాగే శ్వరరావు, ధర్మకర్తలు చీకటి కార్తీక్ ,పెండ్లి రామిరెడ్డి, భూక్య గిరిప్రసాద్, చెవు గాని పాపా రావు, చెరుకూరి శేఖర్ బాబు, ధర్మరాజుల నాగేశ్వరరా వు, శనిగరపు శ్రీనివాసరావు, దుగ్గిరాల సుధాకర్ పాల్గొన్నారు.