
ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ముందుగా అష్టలక్ష్మీ అమ్మవారిని వారు దర్శించుకున్నారు. అనంతరం లకారం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. 11.75 కోట్లతో కేబుల్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటెన్, ఎల్ఈడీ లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రఘునాథపాలెంలో సుడా నిధులతో నిర్మించిన పార్క్ను ప్రారంభించారు.
ఖమ్మం నగరంలో మంత్రి @KTRTRS పర్యటిస్తున్నారు. నగరంలోని లకారం చెరువు పై ₹ 11.75 కోట్లతో నిర్మించిన కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్ & మ్యూజికల్ ఫౌంటెన్, ఎల్ఈడి లైటింగ్ ను మంత్రి @puvvada_ajay తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు pic.twitter.com/cDGLkefrnW
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 11, 2022