రైతు చనిపోయినా బతికున్నట్టే రికార్డు

రైతు చనిపోయినా బతికున్నట్టే  రికార్డు

కాగజ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా  చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన కొమురం మారుతి అనే రైతు చనిపోయినా అతడి కుటుంబానికి రైతుబీమా అందడం లేదు. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. మారుతికి  గ్రామ శివారులోని సర్వే నంబర్​లో 174/1/21/4  లో ఎక రం పది గంటల భూమి ఉంది. దీనికి డిజిటల్ పాస్ బుక్  కూడా జారీ అయ్యింది.  అతడు 2021 నవంబర్ 15 న చనిపోయాడు. రైతు బీమా కోసం  అతడి భార్య పద్మ , కొడుకు నరేశ్​ గ్రామ పంచాయతీలో అదే ఏడాది డిసెంబర్ 12 న డెత్ సర్టిఫికెట్  తీసుకున్నారు. రైతు బీమా ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేశారు. అయితే ఆన్​లైన్​లో  పేరు లేదని ఇన్సూరెన్స్ రిజెక్ట్ చేశారు.

దీంతో పద్మ మార్చి  23న ఐటీడీఏ పీవో కు అర్జీ పెట్టుకుంది.  అయినా ఇప్పటివరకు న్యాయం జరగలేదు.  కాగా, అగ్రికల్చర్​ రికార్డుల్లో మారుతి బతికే ఉన్నాడు. రైతు చనిపోతే ఆ వివరాలను పోర్టల్​లో  అగ్రికల్చర్​ ఆఫీసర్లు నమోదు చేయకపోవడంతోనే సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.  ఇప్పటికైనా ఆఫీసర్లు గుర్తించి తమకు బీమా ఇప్పించాలని మారుతి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.