టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేశారు గద్వాల్ కాంగ్రెస్ బహిష్కృత నేత కురువ విజయ్ కుమార్. రేవంత్ టికెట్లు అమ్ముకుని డబ్బులు దండుకున్నారంటూ విజయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు . టికెట్లు అమ్ముకున్న డబ్బులతో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిపై సమగ్ర విచారణ జరపాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు.
రేవంత్ కాంగ్రెస్ అధిష్టానికి తప్పుడు నివేదికలు ఇచ్చి, ఎన్నికలకు రెండు నెలల ముందే డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని విజయ్ ఆరోపించారు. ఈ సందర్భంగా వెంటనే విచారణ జరిపించాలంటూ హైదరాబాద్లోని ఈడీ జాయింట్ డైరెక్టర్కు సాక్షాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై ప్రశ్నిస్తే తనని సస్పెండ్ చేశారని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా రేవంత్ పై, పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేసిన గద్వాల చెందిన కురువ విజయ్ కుమార్, బహుదూర్ పురా నియోజకవర్గానికి చెందిన ఖాలిమ్ బాబాలను ఇటీవల కాంగ్రెస క్రమశిక్షణ కమిటీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.