తప్పుడు ప్రచారం మానుకోవాలి : క్యామ మల్లయ్య

తప్పుడు ప్రచారం మానుకోవాలి : క్యామ మల్లయ్య

వంగూర్, వెలుగు: మండలంలోని రంగాపూర్  గ్రామానికి చెందిన కాంగ్రెస్  కార్యకర్తలు బీఆర్ఎస్  పార్టీలో చేరినట్లు తప్పుడు ప్రచారం చేయడం తగదని అచ్చంపేట అసెంబ్లీ యూత్  కాంగ్రెస్  వర్కింగ్  ప్రెసిడెంట్  క్యామ మల్లయ్య పేర్కొన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్  నుంచి బీఆర్ఎస్ లో ఎవరూ చేరలేదన్నారు.

ALS0 READ: కాంగ్రెస్ వైపు చూస్తున్న యువత: పటేల్ రమేశ్ రెడ్డి 

తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరైంది కాదన్నారు. ఓటమి భయంతో ఎమ్మెల్యే గువ్వల ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. నాగరాజు, మొగులయ్య, జనార్ధన్, చంద్రశేఖర్, శంకర్  ఉన్నారు.