
ఎలక్ట్రిక్ టూవీలర్ ఐఫ్లోను 22 కిమ్కో కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రీమియం మ్యాక్సీ స్కూటర్ కేటగిరీ కింద, అత్యాధునికమైన ఐసీఈ టెక్నాలజీ ఆధారిత లైక్200, ఎక్స్–టౌన్ 300ఐ ఏబీఎస్ స్కూటర్లను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఐఫ్లో ధర ఎక్స్షోరూం ఢిల్లీలో రూ.90 వేలు కాగా, లైక్200 ధర రూ.1,30,000, ఎక్స్–టౌన్ 300ఐ ఏబీఎస్ ధర రూ.2,30,000గా కంపెనీ పేర్కొంది. హర్యానాలోని భివాండీలో భారీ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని కిమ్కోచెప్పింది.