శ్రీకృష్ణుడిగా లక్ష్మీనారసింహుడు

శ్రీకృష్ణుడిగా లక్ష్మీనారసింహుడు
  •     సాయంత్రం పొన్న వాహనంపై ఊరేగిన నృసింహుడు
  •     నేడు గోవర్ధనగిరిధారిగా దర్శనం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారు శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి స్వామివారిని పొన్నవాహనంపై మాఢవీధుల్లో ఊరేగించారు. అనంతరం తూర్పు ద్వారం ఎదుట స్వామి వారిని అధిష్ఠింపజేసి పొన్నవాహన సేవ ప్రత్యేకతలను ప్రధానార్చకులు నల్లంథీగల్‌‌‌‌ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు వివరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి గోవర్ధనగిరిధారి అలంకార సేవ, సింహవాహన సేవను నిర్వహించనున్నారు.