బాసెస్ : ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ స్విస్ ఓపెన్ సూపర్300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-–12, 21–-13తో థాయ్లాండ్కు చెందిన పొర్నిచ చోయికీవాంగ్పై వరుస గేమ్స్లో విజయం సాధించి రెండో రౌండ్ చేరింది. మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-–17, 21–-18తో వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)పై వరుస గేమ్స్లో నెగ్గాడు.
మరో మ్యాచ్లో ఫామ్లో ఉన్న లక్ష్యసేన్ 21–-19, 15–-21, 21–-11తో లియాంగ్ జున్ హవో(మలేసియా)పై గెలిచాడు. విమెన్స్ డబుల్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో 21–-18, 18–-21, 21-–19తో మెలిసా– రాచెల్ అలీసా (ఇండోనేషియా)పై, ప్రియ – శృతి మిశ్రా 21-–13, 21-–19తో హువాంగ్ హు, లియాంగ్(చైనీస్ తైపీ)పై నెగ్గగా, గాయత్రి–ట్రీసా జాలీ 21-–15, 21–-12 తో అమెరికాకు చెందిన అనీ జు–కెర్రీ జుపై గెలిచి రెండో రౌండ్ చేరింది.