లష్కరే టెర్రరిస్టు నేత తుండా నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

లష్కరే టెర్రరిస్టు నేత తుండా నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

అజ్మీర్: లష్కరే తయిబా టెర్రరిస్టు నేత అబ్దుల్ కరీం తుండాను రాజస్థాన్ లోని ప్రత్యేక కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దేశంలో1993లో జరిగిన వరుస రైలు బాంబు పేలుళ్ల కేసులో కోర్టు తీర్పు ఇచ్చింది. కేసులో నిందితుడికి వ్యతిరేకంగా ఆధారాలు లేవని చెప్పింది. అయితే, ఈ కేసులో తుండాతో పాటు అభియోగాలు ఎదుర్కొంటున్న ఇద్దరు నిందితులు అమీనుద్దీన్, ఇర్ఫాన్ లను మాత్రం ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. కాగా, 1996 బాంబు పేలుళ్ల కేసులో ప్రస్తుతం తుండా జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు దావూద్ ఇబ్రహీంకు తుండా అత్యంత సన్నిహితుడని చెప్తారు