ఆధార్ అన్నింటికి ఆధారమే ఇపుడు. సంక్షేమ పథకాల అమల్లో ఆధార్ కీలకంగా మారింది. అయితే ఫ్రీగా ఆధార్ అప్ డేట్ చేసేందుకు మార్చి 14 వరకు UIDAI గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆన్ లైన్ లో ,ఆఫ్ లైన్లో ఆధార్ అప్ డేట్ ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం.
ఆఫ్ లైన్లో అయితే ఆధార్ అప్ డేట్ చేసుకునే వాళ్లు దగ్గర్లో మీ సేవా సెంటర్లదగ్గరకు వెళ్లి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చి అప్ డేట్ చేసుకోవాలి. వాళ్లు రూ. 50 వరకు చార్జ్ చేసే అవకాశం ఉంది. అదే ఆన్ లైన్ లో అయితే కాసేపు ప్రయత్నిస్తే ఫ్రీగా ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఒకసారి చూద్దాం
ఆధార్ కార్డ్ ని ఎలా అప్ డేట్ ఇలా చేయాలి
- అధికారిక UIDAI వెబ్ సైట్ https://myaadhaar.uidai.gov.in/ ని సందర్శించాలి.
- ఆధార్ నంబర్ , క్యాప్చా నమోదు చేయాలి
- OTPని Send పై క్లిక్ చేసి మీరు లింక్ చేసిన ఫోన్ నంబర్ ద్వారా అందుకున్న OTP ని నమోదు చేయాలి
- తర్వాత అప్ డేట్ డోమోగ్రాఫిక్స్ డేటా ఎంచుకోవాలి.
- పేజీలో సంబంధిత ఎంపికలను ఎంచుకొని Proceed పై క్లిక్ చేయాలి.
- తర్వాత కూడా పేజీలో మార్పులు చేయొచ్చు.
- సంబంధిత పత్రాలను అప్ లోడ్ చేయాలి
- నమోదు చేసిన వివరాలను ఒకసారి చెక్ చేసుకోవాలి
- Change Request క్లిక్ చేయడం ద్వారా ఫారమ్ ను సబ్ మిట్ చేయాలి.
- మార్పు స్థితిని ట్రాక్ చేయడానికి అప్ డేట్ అభ్యర్థన సంఖ్య (URN) ని ఉపయోగించాలి.