సుస్థిర జాతి నిర్మాణానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ బాటలు వేశారని, తొలి ఉపప్రధానిగా, హోంమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశ ఐక్యతకు దోహదం చేశాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్నాయుడు, పలువురు వక్తలు అన్నారు. పటేల్150వ జయంతిని ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాయకులు, అధికారులు, ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన ఫ్లెక్సీలకు నివాళి అర్పించారు.
జిల్లా కేంద్రాల్లో 2 కె రన్చేపట్టారు. జాతీయ జెండాలతో ర్యాలీలు తీశారు. బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు అశోక్గౌడ్, నల్గొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు శ్రీలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. – వెలుగు, నెట్వర్క్
