ఏడుపాయల జాతరలో తల్లీ, కొడుకు, కూతురు.. ఒకే చోట డ్యూటీ

ఏడుపాయల జాతరలో  తల్లీ, కొడుకు, కూతురు.. ఒకే చోట డ్యూటీ

మెదక్, పాపన్నపేట, వెలుగు:  ఒకే ఇంట్లో ముగ్గురికి  ఉద్యోగాలు రావడం అరుదు. అదీ  అందరికీ ఒకే డిపార్ట్​మెంట్ లో ఉద్యోగం లభించడం ఇంకా అరుదు. అలా వచ్చినా ఒక్కొకరు ఒక చోట విధులు నిర్వర్తిస్తారు. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న ఆ ముగ్గురు  ఒకే చోట డ్యూటీ చేస్తే.. అలాంటి. అరుదైన సందర్భానికి ఏడుపాయల జాతర వేదికైంది.

మెదక్ పట్టణానికి చెందిన కానిస్టేబుల్ గంగమణి తూప్రాన్ లో షీ టీమ్ లో పని చేస్తున్నారు. సబ్ ఇన్​స్పెక్టర్ అయిన ఆమె కొడుకు నవీన్ చంద్ర కామారెడ్డి జిల్లా జుక్కల్ పీఎస్​లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. గంగ మణి కూతురు శ్రీజ మెదక్ రూరల్ పీఎస్​లో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. మహా శివరాత్రి జాతర సందర్భంగా వారు ముగ్గురికి ఏడుపాయల్లో బందోబస్తు డ్యూటీ పడింది. ఇలా తల్లీ, కొడుకు, కూతురు ముగ్గురు ఒకే చోట విధులు నిర్వహించడం విశేషం.