నిలకడగా ఆడుతున్న భారత్ 

నిలకడగా ఆడుతున్న భారత్ 

ఆసియా కప్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో  భారత్ నిలకడగా ఆడుతుంది.  కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ప్రారంభంలోనే  కీలకమైన 2 వికెట్లు కోల్పోగా.. సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ ఆచితూచి ఆడారు. అందివచ్చిన చోట బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 79 రన్స్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నారు. రోహిత్(53), సూర్య కుమార్ యాదవ్(17) క్రీజులో ఉన్నారు. మరో 5 ఓవర్లు వీరిద్దరు ఔట్ కాకుండా ఉండే భారత్ భారీ స్కోర్ చేసేలా కనిపిస్తోంది.