దీపావళి క్రాకర్స్ వల్ల ఓ లైబ్రరీ కాలిపోయింది. ఈ ఘటనలో రూ. 3 లక్షల విలువైన పుస్తకాలు కాలిపోయాయి. ఈ ఘటన షాద్నగర్లో వెలుగుచూసింది. లైబ్రరీ సమీపంలో కాల్చిన రాకెట్లు కిటికీ నుంచి లైబ్రరీలోకి వెళ్లడంతో మంటలంటుకున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని గ్రేడ్ 1 శాఖ గ్రంధాలయం స్థానంలో నూతన గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. లైబ్రరీని ఓల్డ్ గంజ్లో ఓ తాత్కాలిక భవనంలో ఏర్పాటుచేశారు. భవనంలో స్థలం సరిపోకపోవడంతో చాలా పుస్తకాలను ఓ గదిలో పెట్టారు. వాటికి కిటికీలు లేకపోవడంతో తారాజువ్వలు ఎగిసి కిటికీ నుంచి లోపల ఉన్న పుస్తకాల మీద పడ్డాయి. దాంతో మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. స్థానిక ప్రజలు గమనించి వెంటనే షాద్నగర్ ఫైర్ స్టేషన్కు సమాచారం అందజేశారు. సకాలంలో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని గదిలో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కానీ అప్పటికే చాలా పుస్తకాలు కాలి బూడిద అయ్యాయి. మంటలు ఆర్పే సమయంలో నీటిని చల్లడంతో చాలా పుస్తకాలు నీటిలో నాని పాడయ్యాయి. అగ్ని ప్రమాద ఘటనతో దాదాపు 4వేల పుస్తకాలు కాలిపోయాయని.. వాటి విలువ సుమారు మూడు లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
రాకెట్లతో మంటలంటుకొని 4 వేల పుస్తకాల దగ్ధం
- తెలంగాణం
- November 5, 2021
లేటెస్ట్
- Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!
- వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
- హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
- ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
- హైదరాబాద్ను వరల్డ్ బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం..
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో మనుషులు మింగే 40 రకాల ట్యాబ్లెట్స్ సీజ్.. మెడికల్ షాపులు సీజ్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్