న్యూఢిల్లీ: డీమెర్జ్ అయిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యూనిట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్లో తమకు 6.66 శాతం వాటాలు వచ్చాయని ఎల్ఐసి మంగళవారం తెలిపింది. ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్' ద్వారా డీమెర్జర్ యాక్షన్ విధానంలో 'జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్'లో 6.66 శాతం వాటాలు వచ్చాయని రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆగస్టు 21న స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్అయింది. ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.1.60 లక్షల కోట్లకు చేరుకుంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు ఒక్కొక్కటి రూ. 239.20 వద్ద ట్రేడవుతున్నాయి. .