యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్క సెప్టెంబర్లోనే రూ.80 కోట్ల లిక్కర్

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్క సెప్టెంబర్లోనే రూ.80 కోట్ల లిక్కర్

యాదాద్రి, వెలుగు: వరుసగా సెలవులు, దసరా పండుగ నేపథ్యంలో లిక్కర్​ అమ్మకాలు జోరుగా సాగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్క సెప్టెంబర్​లోనే రూ.80 కోట్ల లిక్కర్​ అమ్మకాలు జరుగగా, చివరి నాలుగైదు రోజుల్లోనే రూ.40 కోట్ల విక్రయాలు జరిగినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఎక్సైజ్​శాఖకు ఆదాయం దండిగా వచ్చింది. 

రెండేండ్ల కంటే ఎక్కువగా..

యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, మోత్కూరు, రామన్నపేట ఎక్సైజ్​ సర్కిల్​లో 82 వైన్స్​లు, 12 బార్లు ఉన్నాయి.  ఈ దసరా సమయంలోనూ 2023, 2024 కంటే ఈసారి లిక్కర్​ సేల్స్​గణనీయంగా పెరిగింది. 2023 దసరా సీజన్​లో రూ.26 కోట్ల లిక్కర్​ అమ్ముడుపోగా, 2024లో రూ.38 కోట్ల లిక్కర్​ సేల్స్​ జరిగింది. ఈసారి సెప్టెంబర్​ 28 వరకూ రూ.80 కోట్ల విలువైన లిక్కర్​ను వైన్స్, బార్లు లిఫ్ట్​ చేశారు. ఇందులో చివరి నాలుగైదు రోజుల్లోనే రూ.40 కోట్లకు మించి లిక్కర్​ అమ్మడు పోయిందని తెలుస్తోంది.