అమెరికాలో ఓ ట్రక్ డ్రైవర్ను లక్ష్మీ దేవి వరించింది. ఒకే సంవత్సరంలో మూడు సార్లు జాక్ పాట్ కొట్టాడు. ఆయన ఆడిన ప్రతిసారి అదృష్ట సంఖ్యలపై పందెం వేసేవాడని మేరీల్యాండ్ లాటరీ అధికారులు చెప్పారు. రెండు వేర్వేరు టికెట్లపై ఒకే నంబర్తో ఆడేవాడు. దీంతో తన బహుమతి రెట్టింపు అయేది. ఆయన 10 వేల డాలర్లను ఇంటికి తీసుకెళ్లాడు.2022 సంవత్పరంలో ట్రక్ డ్రైవర్ పిక్ 5 గేమ్ ఆడేవాడని లాటరీ అధికారులు తెలిపారు. అతడు మొదటి రెండు విజయాలు అందుకున్నఅదే సంవత్సరంలో ఏప్రిల్ 13న మళ్లీ గెలిచాడు. అతను భార్య చెప్పిన నంబర్ పై ఆడేవాడని తెలిపాడు.
జీవితంలో అదృష్ట సంఖ్యల చాలా ముఖ్యమైనవని. ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. చాలా మంది వ్యక్తులు సంఖ్యా శాస్త్రం ప్రకారం ప్రతి పని చేస్తుంటారు. అలా చేసిన ఓ ట్రక్ డ్రైవర్ ఏడాదిలోనే కొటీశ్వరుడయ్యాడు. ఒకే నంబర్తో కారు,మొబైల్ ఫోన్లో అదే నంబర్, అదే నంబర్ ఇల్లు ప్రతి దానికి అదే నంబర్లు ఉపయోగించే వారుంటారు . తన అదృష్ట సంఖ్యను గుర్తించి .. దాంతో ఒకటి, రెండు కాదు ఏకంగా మూడు సార్లు లాటరీ టిక్కెట్ను గెలుచుకున్నాడు.
తొలి ప్రయత్నంలోనే 50 వేల డాలర్లు
తొలి ప్రయత్నంలోనే 50 వేల డాలర్ల బహుమతిని గెలుచుకున్నాడు. ఈ సంఖ్య అద్భుతమైనదని భావిస్తున్నట్లు ట్రక్ డ్రైవర్ భార్య చెప్పింది. గత ఏడాది మేలో మళ్లీ టిక్కెట్ను కొనుగోలు చేసి 50 వేల డాలర్ల బహుమతిని గెలుచుకోగలిగాడు. మేరీల్యాండ్కు చెందిన ఈ వ్యక్తి గతంలో కూడా అదే నంబర్పై పిక్ 5 గేమ్ ఆడాడని లాటరీ అధికారులు తెలిపారు. మూడవసారి లక్కీ విన్నర్ అయ్యాడు. ఈసారి కూడా అతని పేరు మీద 50 వేల డాలర్లు వచ్చాయి.
అదృష్టం ...మూడు సార్లు
ఒకే వ్యక్తి కేవలం సంవత్సరంలోనే మూడు సార్లు లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేశాడు. స్క్రాచ్ మరియు అదృష్టం మూడు సార్లు వరించిమది. ఇప్పటి వరకు 1 లక్షా 50 వేల డాలర్లు అంటే దాదాపు 1.2 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. "చాలా మంది విజేతలు తమ అదృష్ట నంబర్ని డ్రా చేసిన తర్వాత ఆడటం మానేస్తారని మరియు వారి నంబర్ను మళ్లీ హిట్ చేయలేదని తప్పుగా భావిస్తారని నేను నమ్ముతున్నాను." అని లక్కీ విన్నర్ తెలిపాడు. అతను ఇంకా ఆడాలని యోచిస్తున్నట్లు తెలిపాడు.