ప్రియుడు బిల్డింగ్‌పై నుంచి తోసేయడంతో ప్రియురాలు మృతి

ప్రియుడు బిల్డింగ్‌పై నుంచి తోసేయడంతో ప్రియురాలు మృతి

వనస్థలిపురం లో దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న వాసవీ నిలయం అపార్టుమెంట్ 3వ అంతస్తుపై నుంచి కిందకు ప్రియురాలిని కొట్టి నెట్టివేశాడు ఓ యువకుడు. నేలమీద పడిన యువతి.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయింది.

15 రోజుల కిందే మధ్యప్రదేశ్ నుంచి వచ్చి.. హైదరాబాద్ వనస్థలిపురంలో ఈ యువతీ యువకుడు ఉంటున్నట్టు స్థానికులు చెప్పారు. శక్తినగర్ లోని వాసవి నిలయం  భవన నిర్మాణాల పనుల్లో ఈఇద్దరూ చేరారని చెప్పారు. ఐతే.. ఇదే భవనంపై గొడవ జరగడంతో యువతి సీమను పైనుంచి కిందకు తోసేశాడు యువకుడు దిలీప్. ఆమెను వెంటనే  ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అప్పటికే సీమ మృతిచెందినట్టు డాక్టర్లు చెప్పారు. పరారీలో ఉన్న ప్రియుడు దిలీప్ కోసం వెతుకుతున్నారు పోలీసులు. అతడిపై మర్డర్ కేసు పెట్టారు.