కొత్త టెక్నాలజీతో రక్షణ రంగం మరింత పటిష్టం : లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్న్షే

కొత్త టెక్నాలజీతో రక్షణ రంగం మరింత పటిష్టం :  లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్న్షే

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: రక్షణ రంగాలను మరింత పటిష్టం చేయడానికి, ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి కొత్త టెక్నాలజీపై దృష్టిపెడుతున్నామని మిలిటరీ కాలేజ్​ఆఫ్ ఎలక్ర్టానిక్స్​ అండ్ మెకానికల్​ ఇంజినీరింగ్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్​ నీరజ్​ వర్న్షే అన్నారు. గురువారం గీతం యూనివర్సిటీలో జరిగిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రక్షణ రంగాన్ని ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. 

ఇందుకోసం వివిధ ఇంజినీరింగ్ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఎయిర్​ ఫోర్స్​ అకాడమీ వింగ్ కమాండర్​ శివాంచల్​ఆస్థానా మాట్లాడుతూ సాంకేతిక ఆవిష్కరణలతో భారత నావికదళం పటిష్టంగా ఉందన్నారు. కార్యక్రమంలో వీసీ డీఎస్ రావు, కోర్​ ఇంజినీరింగ్ డీన్​ రామశాస్త్రి, కెప్టెన్​ శర్మ, ప్రొఫెసర్ శ్రీనివాస్, వర్క్​షాప్​ కన్వీనర్​ ప్రీతి అంబరీశ్ సర్వేకర్​, కో కన్వీనర్​ జయప్రకాశ్​శ్రీవాస్తవ, ఎండీ అక్తర్​ఖాన్, డాక్టర్​ అనీత, ప్రవీణ్ కుమార్​ పాల్గొన్నారు.