భద్రాచలం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ధనిరా తాలూకా గ్యారాపట్టి అటవీ ప్రాంతంలో గత శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 27కు చేరుకుంది. ఘటనా స్థలంలో ఆ రోజు 26 మంది నక్సల్స్ మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సీ-60 బలగాలు తాజాగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మరో మావోయిస్టు శవం దొరికింది. అతని శవాన్ని బుధవారం ఐడెంటిఫికేషన్ కార్యక్రమంలో దండకారణ్యం స్పెషల్ జోనల్ సమితి సభ్యుడు సుఖ్లాల్గా గుర్తించారు.
మహారాష్ట్ర-– చత్తీస్గఢ్ సరిహద్దుల్లో కీలకమైన మావోయిస్టు లీడర్ సుఖ్లాల్. ఇతనిపై రూ.25 లక్షల రివార్డు ఉంది. 51 కేసుల్లో ప్రధాన నిందితుడు. 20 హత్యలు చేశాడు. 16 విధ్వంసాల్లో కీలక సూత్రధారి.