టైం బాగోలేదు : మాథెరన్ టాయ్ ట్రైన్ కూడా పట్టాలు తప్పింది

టైం బాగోలేదు : మాథెరన్ టాయ్ ట్రైన్ కూడా పట్టాలు తప్పింది

ఒడిశాలో ట్రైన్​ యాక్సిడెంట్ మిగిల్చిన విషాదం మరువకముందే మహారాష్ర్టలో మరో రైలు ప్రమాదం జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్​లో అందరూ సేఫ్ గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారు చెప్పిన వివరాల ప్రకారం..  మథేరన్​ హిల్​స్టేషన్​ నుంచి నేరల్​కు టాయ్​  ట్రైన్​ బయల్దేరింది. ముంబైకి 95 కి.మీ.ల దూరంలో ఉన్న జుమ్మా పట్టి స్టేషన్​ సమీపంలో రైలు పట్టాలు తప్పింది.  డ్రైవర్​ అప్రమత్తం అయి వేగాన్ని అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది. 

95 మంది ప్రయాణికులు

ప్రమాద సమయంలో ట్రైన్​లో 95 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు చెప్పారు.  వారు వేరే మార్గాల్లో గమ్మస్థానాలకు చేరారని వెల్లడించారు.  రైల్వే సిబ్బంది సమస్య పరిష్కరించడంతో శనివారం అర్ధరాత్రి ట్రైన్​ నేరల్​ స్టేషన్​ కు చేరుకుంది.  నేరల్​ నుంచి మాథేరన్​కు వెళ్లే చివరి రైలు రద్దు అయినట్లు రైల్వే ఆఫీసర్లు చెప్పారు.