మహారాష్ట్రకు చెందిన లలిత్ కుమార్ సాల్వే(36) తండ్రయ్యాడు. అయితే ఇది సాధరణ విషయమైతే కాదండోయ్.. 1988లో పుట్టిన లలిత్ కుమార్ పుట్టకతో స్త్రీ. పేరు లలిత.. 2010లో మహిళా కానిస్టేబుల్గా ఎంపికయింది. తన శరీరంలో మార్పులు వస్తున్నట్లు 2013లో గుర్తించి వైద్యులను సంప్రదించగా... పురుషుల్లో ఉండే వై క్రోమోజోములు ఆమెలో ఉన్నట్లు బయటపడింది. దీంతో లింగమార్పిడి చికత్స చేసుకోవాలిని వైద్యులు సూచించారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి పొందిన తరువాత 2018 నుంచి 2020 మధ్యలో మూడు శస్త్రచికిత్సలు చేసుకుని తన పేరును లలిత్ కుమార్ సాల్వేగా మార్చుకుంది. ఆ తరువాత ఛత్రపతి శంభాజీనగర్ ప్రాంతానికి చెందిన సీమా అనే అమ్మాయిని 2020లో పెళ్లి చేసుకోగా 2023లో వీరికి ఈ నెల 15న మగబిడ్డ పుట్టాడు. తాను స్త్రీ నుంచి పురుషునిగా మారే కాలంలో అనేక మంది తనకు మద్దతుగా నిలిచారని లలిత్ చెప్పారు. ఇప్పుడు తాను తండ్రిని అయినందుకు ఆనందంగా ఉందని తెలిపాడు.