
కన్నడ టాప్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘మహావతార్ నరసింహా’. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్ను జులై 25న పాన్ ఇండియా వైడ్గా ఐదు భాషల్లో త్రీడీ ఫార్మాట్లో విడుదల చేస్తున్నారు.
మంగళవారం (జులై 01) రిలీజ్ చేసిన ఈ మూవీ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ‘అధర్మం పెరిగినప్పుడు అతను దేవుళ్లకు సవాలు విసిరాడు’ అంటూ ఈ చిత్రంలోని హిరణ్యకశ్యప పాత్రను పరిచయం చేసిన విధానం ఆకట్టుకుంది.
యానిమేటెడ్ ఫ్రాంచైజీగా దీన్ని రూపొందించారు. మహావిష్ణువు దశావతారాల పురాణ గాథను ఇందులో చూపిచంబోతున్నారు. త్రీడీ విజువల్స్, బెస్ట్ టెక్నికల్ వాల్యూస్తోపాటు పవర్ఫుల్ బీజీఎం ఇంప్రెస్ చేస్తున్నాయి.