23 వేల మంది ఉద్యోగులకు.. స్టాక్ ఓనర్షిప్ ప్లాన్

23 వేల మంది ఉద్యోగులకు.. స్టాక్ ఓనర్షిప్ ప్లాన్
  • ప్రకటించిన మహీంద్రా

న్యూఢిల్లీ:  ఫ్యాక్టరీ ఫ్లోర్ వర్కర్లు సహా దాదాపు 23 వేల మంది ఉద్యోగుల కోసం వన్-టైమ్ ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌‌‌‌‌‌‌‌షిప్ ప్లాన్ (ఈసాప్​)ను ప్రారంభిస్తున్నట్లు మహీంద్రా అండ్​ మహీంద్రా గ్రూప్ సీఈఓ, ఎండీ అనిష్ షా తెలిపారు.  

వీటి విలువ రూ. 400-500 కోట్ల పరిధిలో ఉంటుందని ఆయన అన్నారు. మహీంద్రా  మూడు కీలక అనుబంధ సంస్థలు - మహీంద్రా అండ్​ మహీంద్రా (ఆటో,  వ్యవసాయ రంగాలు), మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్,  మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ ఉద్యోగులకు వర్తిస్తుందని ప్రకటించారు. షేర్లు రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్ల (ఆర్​ఎస్​యూ) రూపంలో మంజూరవుతాయి.   

తమ మార్కెట్ క్యాప్ గత ఐదు సంవత్సరాల్లో 12 రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. గ్రూప్​లో కనీసం 12 నెలల సర్వీసు గల పర్మనెంట్​ఉద్యోగులు ఈసాప్​లను పొందేందుకు అర్హులు అవుతారు. మహీంద్రా అండ్​ మహీంద్రా జూన్ క్వార్టర్​లో కన్సాలిడేటెడ్ నికర లాభంలో 24 శాతం పెరుగుదలతో రూ. 4,083 కోట్లకు చేరుకుంది.