
డైనమిక్ హీరో అడవి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు పనులను హీరో అడవి శేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మేజర్ సినిమాలో అడవి శేష్ హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఇప్పటికే చాలా సార్లు మేజర్ మూవీ విడుదల తేదీ మార్చిన చిత్ర బృందం.. తాజాగా ఈ ఏడాది జూన్ 3వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించింది. ముంబై 26/11 ఉగ్రదాడుల్లో పోరాడి చాలా మందిని కాపాడి, వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.
యువ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేషు.. రన్ రాజా రన్, గూఢచారి, ఎవరు వంటి విభిన్న కథలను ఎంచుకుంటూ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇక ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీశర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ లో అడవి శేష్ నుదిటపై గాయంతో కనిపించగా.. తాజ్ హోటల్ కు ఉగ్రవాదులు నిప్పు పెట్టిన విజువల్స్ స్టన్నింగ్ కనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ హృదయం పాట సంగీత ప్రయులను ఆకట్టుకుంది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న మేజర్ మూవీలో
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బాల్యం,సైన్యంలో పని చేసిన అద్భుతమైన ఘట్టాలు, ముంబై దాడిలో వీరమరణంతో పాటు అతడి జీవితానికి సంబంధించిన విభిన్న కోణాలను ఈ మూవీలో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు.
#MAJOR
— Mahesh Babu (@urstrulyMahesh) April 27, 2022
In Cinemas June 3rd 2022! @AdiviSesh @saieemmanjrekar @SashiTikka @SonyPicsIndia @GMBents @AplusSMovies pic.twitter.com/1evh2fpmnm
మరిన్ని వార్తల కోసం..