వామ్మో నల్లగొండలో మత్తుగోలీల దందా.. 8మంది అరెస్టు.. భారీగా మత్తుమందులు స్వాధీనం

వామ్మో  నల్లగొండలో మత్తుగోలీల దందా.. 8మంది అరెస్టు.. భారీగా మత్తుమందులు స్వాధీనం

నల్లగొండ జిల్లాలో జోరుగా మత్తు గోలీల అక్రమ దందా సాగుతోంది. ఎలాంటి డిస్క్రిప్షన్​ లేకుండా  మత్తు మాత్రలను విక్రయిస్తున్న ముఠాతోపాటు కొనుగులు  చేసిన పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి నుంచి భారీగా మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో తొర్రూర్​ మండలం కేంద్రంలోని ఓ మెడికల్​షాపునుంచి కొనుగోలుచేసి అక్రమంగా విక్రియస్తున్నట్లు డ్రగ్​ కంట్రోల్​ అధికారులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే..    

నల్గొండలో అక్రమంగా మత్తు మాత్రలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఈగల డ్రగ్​ అండ్​ కంట్రోల్​ బోర్డు అధికారుల తోపాటు నల్లగొండ పోలీసులు జాయింట్​ ఆపరేషన్​ నిర్వహించి మత్తు మాత్రలను విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు.మంగళవారం ( అక్టోబర్​21) నల్లగొండలో మత్తు మాత్రల ముఠాపై ఈగల్​ఫోర్స్​, నల్లగొండ పోలీసులు జరిపిన దాడిలో స్పాస్మోప్ప్రాక్సివాన్​ ప్లస్​, ట్రామడాల్​ టాబ్లెట్లు అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు.  ప్రధాన పెడ్లర్​ మద్​ జబినుల్లా, మెడికల్​ షాపు ఓనర్ దారం కృష్ణసాయితోపాటు 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 9మంది పరారీలో ఉన్నారు. వీరిపై NDPS యాక్ట్​ కింద కేసు నమోదు చరేశారు. 

మహ్మద్​ జబీనుల్లా అనే వ్యక్తి గత కొంత కాలంగా మత్తు మాత్రలకు బానిపై కొనుగోలు, అమ్మకాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తొర్రూర్ లోని ఓ మెడికల్​ షాపునుంచి ఎలాంటి డిస్క్రిప్షన్​ లేకుండా మాత్రలు కొనుగోలు చేసి విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది.