ఇంజినీరింగ్ స్టూడెంట్ సూసైడ్.. మల్లారెడ్డి ఎంఆర్ఐటీ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్

ఇంజినీరింగ్ స్టూడెంట్ సూసైడ్.. మల్లారెడ్డి ఎంఆర్ఐటీ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్

జీడిమెట్ల, వెలుగు: ఇంజినీరింగ్​ చదువుతున్న ఓ విద్యార్థి సూసైడ్​ చేసుకున్నాడు. నల్గొండ జిల్లా దామరచర్ల కృష్ణారావు కాలనీకి చెందిన పి.మల్లికార్జున(19) మైసమ్మగూడలోని సిరి డీలక్స్​ హాస్టల్​లో ఉంటూ మల్లారెడ్డి ఎంఆర్​ఐటీ కాలేజీలో బీటెక్​ థర్డ్​ ఇయర్​ చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం పరీక్షలు ముగిశాక రాత్రి 10:30 గంటల వరకు స్నేహితులతో గడిపాడు. రాత్రి 11:45 గంటలకు అతడి రూమ్​కి వెళ్లి పిలవగా స్పందన లేదు. తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్​కు టవల్​తో ఉరి వేసుకుని కన్పించాడు. మృతికి ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది.