బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రూ.5 లక్షల ఫైన్

బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రూ.5 లక్షల ఫైన్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోల్‌కతా హైకోర్టు రూ.5 లక్షల జరిమానా విధించింది. నందిగ్రామ్ ఎన్నికల లెక్కింపునకు సంబంధించిన కేసును విచారిస్తున్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కౌషిక్‌ చందాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని మమత ఆరోపించారు. ఈ మేరకు కౌషిక్ చందాను ఆ కేసును తప్పించి పిటిషన్‌ను మరొక జడ్జికి బదలాయించాలని ఆమె కోరారు. ఈ పిటిషన్‌ను బుధవారం స్వయంగా కౌషిక్ చందానే విచారించారు. మమత పిటిషన్‌ను తోసిపుచ్చిన కౌషిక్ చందా.. న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదించారంటూ మమతకు జరిమానా విధించారు. అదే సమయంలో ఆ కేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. జ‌డ్జికి క‌ళంకం తెచ్చే విధంగా సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ముంద‌స్తుగా ప్ర‌ణాళిక వేసుకున్నారని ఆరోపించారు. రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన విధుల‌ను ఆమె ఉల్లంఘించారని ఫైర్ అయ్యారు.