- కర్నాటకలోని హసన్ జిల్లాలో ఘటన
బెంగళూరు: భార్యాబిడ్డల ప్రాణాల కంటే తనకేదీ ముఖ్యం కాదనుకున్న ఓ వ్యక్తి.. ఏకంగా చిరుతపై పోరాటం చేసిండు. తన దగ్గరేం లేకున్నా, ఉట్టి చేతులతోనే దానిపై కలవడ్డడు. చివరికి దాన్ని చంపేసి, తన భార్యాబిడ్డలను కాపాడుకున్నడు. అయితే చిరుత పంజా విసరడంతో అతని భార్య, బిడ్డకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి, ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఈ సంఘటన కర్నాటకలోని హసన్ జిల్లాలో జరిగింది.
బైక్ పై వెళ్తుంటే ఎటాక్…
హసన్ జిల్లా హరిసెక్రె తాలూకాకు చెందిన రాజగోపాల్ నాయక్.. తన భార్య, బిడ్డతో బైక్పై ఊరికి పోతుండు. బెండాక్రె ప్రాంతానికి చేరుకోగానే అటవీ ప్రాంతం నుంచి సడెన్ గా వచ్చిన చిరుత.. ఒక్కసారిగా వారి మీదకు దునికింది. దీంతో ముగ్గురూ బైక్ పైనుంచి కిందపడ్డరు. పక్కకు పడ్డ రాజగోపాల్ తేరుకునేలోపే.. తన భార్య, బిడ్డపై చిరుత దాడి చేస్తోంది. అది గమనించిన ఆయన వెంటనే, దానిపైకి దూకాడు. ఎలాంటి ఆయుధాలు లేకుండానే దానితో పోరాడి చంపేసిండు. తనను, తన కుటుంబాన్ని రక్షించుకున్నడు. ఆ దారిపొంట వెళ్తున్న కొందరు.. ఇది గమనించి వారికి సాయమందించారు. గాయపడిన రాజగోపాల్ భార్య, బిడ్డను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి.
ఇవి కూడా చదవండి
పన్నెండేళ్ల పిలగాడు.. చిరుతతో ఫైటింగ్