చికెన్ ఫ్రై చేయలేదని భార్యను చంపి శవాన్ని..

చికెన్ ఫ్రై చేయలేదని భార్యను చంపి శవాన్ని..

బెంగుళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చికెన్ వండలేదని భార్యను కడతేర్చాడో దుర్మార్గుడు. బెంగుళూరుకు చెందిన 30 ఏళ్ల ముబారక్ పాషా అనే వ్యక్తి తన భార్య షిరిన్ భాను, మరియు ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. కాగా.. ఆగష్టు 18న చికెన్ ఫ్రై చేయాలని భార్య భానుకు చెప్పి పాషా బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగొచ్చేసరికి భాను చికెన్ వండలేదు. దాంతో ఎందుకు వండలేదని పాషా.. భార్యను అడిగాడు. దానికి ఆమె పొగరుగా సమాధానం చెప్పడంతో.. పాషా కోపోద్రిక్తుడయ్యాడు. ఆవేశంలో కర్రతో భార్య తల మీద బలంగా కొట్టాడు. దాంతో భాను చనిపోయింది. ఆ సమయంలో పిల్లలు నిద్రపోతుండటంతో.. చప్పుడు కాకుండా భార్య శవాన్ని ఓ గోనే సంచిలో పెట్టి బైకు మీద తీసుకెళ్లి చిక్కబనవర సరస్సులో పడేశాడు. ఆ తర్వాత ఇంటికొచ్చి ఏం తెలియనట్లుగా ఉన్నాడు. అయితే మరుసటి రోజు ఇంట్లో కూతురు కనిపించకపోవడంతో.. భాను తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. పాషాను విచారించడానికి ప్రయత్నించగా.. అతను తప్పించుకు తిరగడం ప్రారంభించాడు. పోలీసుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో.. ఆగష్టు 23 సోమవారం పోలీసు స్టేషన్ కు వచ్చి.. నేరాన్ని అంగీకరించాడు. దాంతో పాషాను అదుపులోకి తీసుకొని పోలీసులు అరెస్ట్ చేశారు.