న్యూఢిల్లీ: కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీపై మ్యాన్ హ్యాండ్లింగ్ సంఘటనను నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్సీడబ్ల్యూ) సీరియస్గా తీసుకుంది. దీనిపై వివరణ ఇవ్వాలని యూపీ పోలీసులను ఆదేశించింది. హత్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన రాహుల్, ప్రియాంకను యూపీ పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఆ టైమ్లో ఓ పోలీస్ ప్రియాంక కుర్తాను పట్టుకున్నాడు. ‘‘ప్రియాంక గాంధీపై మ్యాన్ హ్యాండ్లింగ్ను ఖండిస్తున్నాం. దీనిపై వివరణ ఇవ్వాలని యూపీ డీజీపీని ఆదేశించాం” అని ఎన్సీడబ్ల్యూ సోమవారం ట్వీట్ చేసింది.