ఆరోగ్యం పట్ల అవగాహన కోసం రన్ ఫర్ హెల్త్

ఆరోగ్యం పట్ల అవగాహన కోసం రన్ ఫర్ హెల్త్

ఆరోగ్యం పట్ల అవగాహన కోసం మణిపాల్ హాస్పిటల్ విజయవాడలో  5కె&10కె రన్ నిర్వహించింది. మణిపాల్ హాస్పిటల్స్ 15వ వార్షికోత్సవ సందర్భంగా  ఏపీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవిశంకర్ ఐపీఎస్ అయ్యనార్ సమక్షంలో  బీఆర్టీఎస్ రోడ్ వద్ద .. అమరావతి రన్నర్స్ , రెడ్ ఎఫ్ఎం, డాక్టర్ రెడ్డీస్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ రవిశంకర్ అయ్యనార్ మాట్లాడుతూ.. మణిపాల్ హాస్పిటల్ 15వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న 5కె&10కె రన్ లో పాల్గొనడం  చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రన్ ద్వారా ఆరోగ్యంగా ఉండటం అలాగే ఫిట్ గా ఉండటం ఎంతో ముఖ్యమో తెలియజేస్తున్నారన్నారు.
మణిపాల్ హాస్పిటల్స్  డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ.. మానసికంగా, శారీరకంగా ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ రన్ లో విజేతలుగా నిలిచిన వారికి కృష్ణా జిల్లా కలెక్టర్ , జిల్లా మెజిస్ట్రేట్ శ్రీ జె నివాస్, ఐఏఎస్ బహుమతి ప్రదానం చేశారు.