నిరాయుధీకరణతోనే మణిపూర్‌‌‌‌లో శాంతి.. ప్రధానికి 40 మంది ఎమ్మెల్యేల లేఖ

నిరాయుధీకరణతోనే మణిపూర్‌‌‌‌లో శాంతి.. ప్రధానికి 40 మంది ఎమ్మెల్యేల లేఖ

ఇంఫాల్: మణిపూర్‌‌‌‌లో పూర్తి నిరాయుధీకరణ చేపట్టాలని కోరుతూ ఆ రాష్ట్రానికి చెందిన 40మంది ఎమ్మెల్యేలు ప్రధాని మోదీకి బుధవారం లెటర్ రాశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పెంపొందించేందుకు ఈ చర్య చాలా అవసరమని స్పష్టం చేశారు. దీంతో పాటు కుకీ మిలిటెంట్ గ్రూపులతో కుదుర్చుకున్న' సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్' ఒప్పందాన్ని వాపస్ తీసుకోవాలని మోదీకి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎన్ఆర్సీని అమలుచేసి.. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్​లను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఆయుధాలతో చొరబడుతున్న విదేశీ మూకలను అరికట్టాలని కోరారు.