ఇవ్వాల్టి నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సవాలు

ఇవ్వాల్టి నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సవాలు

నేటి నుంచి మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. తేరు మైదానం వద్ద అదనంగా లడ్డూ కౌంటర్  ఏర్పాటు చేశారు. బస్​స్టాప్  స్థలంలో హరిత హోటల్  నిర్మించడంతో పక్కనే పార్కింగ్  కోసం స్థలం కేటాయించారు. 

ఎండ దెబ్బ తగలకుండా తడకలు ఏర్పాటు చేశారు. రద్దీని నియంత్రించడానికి బారికేడ్స్  ఏర్పాటు చేశారు. మహిళలు దుస్తులు మార్చుకోవడానికి రెండు గదులు ఏర్పాటు చేశారు. హెల్త్  సెంటర్ కోసం రూమ్​ కేటాయించి వైద్య సిబ్బందిని, అంబులెన్స్ ను అందుబాటులో ఉంచారు. కోనేరులో  షవర్లను ఏర్పాటు చేశారు. ఆలయ ముఖ ద్వారాలను విద్యుత్  దీపాలతో అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 24నగరుడ వాహనసేవ రథోత్సవం జరగనుంది. -  మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: