నాగర్ కర్నూల్ జిల్లాలో..ఘనంగా అనాథ యువతుల వివాహం

నాగర్ కర్నూల్ జిల్లాలో..ఘనంగా అనాథ యువతుల వివాహం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్  కర్నూల్  జిల్లా కేంద్రంలోని జ్ఞానేశ్వర వాత్సల్య ఆశ్రమ నిర్వాహకులు దీపిక, మల్లేశ్వరి అనే అనాథ యువతుల పెండ్లిని శుక్రవారం ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. సతీశ్  రెడ్డితో దీపిక, కిరణ్  కుమార్ తో మల్లేశ్వరి పెండ్లిని వేదమంత్రాల మధ్య నిర్వహించారు.

నాగర్ కర్నూల్  కలెక్టర్  పి.ఉదయ్ కుమార్  నవ దంపతులను ఆశీర్వదించారు. ఆశ్రమ నిర్వాహకులు, మున్సిపల్  చైర్ పర్సన్  కల్పన , నారాయణరెడ్డి, ఈశ్వరయ్య, లక్ష్మీశేఖర్, వరలక్ష్మి, శ్యాంసుందర్  పాల్గొన్నారు.