రేవల్లి, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామం వచ్చిన ఓ వివాహిత అదృశ్యమైంది. ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రేవల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ యాకూబ్ కు భార్య రజియా బేగం, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. యాకూబ్మహబూబ్ నగర్ లో ఆటోడ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబంతో అక్కడే ఉంటున్నాడు. మొదటి విడత సర్పంచ్ఎన్నికలకు ఈ నెల 9న స్వగ్రామం వచ్చారు.
అదేరోజు దంపతులు గొడవ పడ్డారు. మరుసటి రోజు రజియా బేగం కనిపించలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆమె భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై పేర్కొన్నారు.
