పాకిస్తాన్ బస్‌లో భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతి

పాకిస్తాన్ బస్‌లో భారీ పేలుడు.. ఎనిమిది మంది మృతి

పాకిస్తాన్‌లో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. ఇంజనీర్లు మరియు ఆర్మీ సిబ్బంది వెళ్తున్న బస్సును పేల్చేశారు. దాంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటన ఉత్తర పాకిస్తాన్‌లోని కైబర్ పంక్తునాఖా ప్రావిన్స్ సమీపంలో జరిగింది. దసు డ్యామ్ నిర్మాణ పనుల నిమిత్తం 30 మంది చైనీస్ ఇంజనీర్లతో పాటు అయిదుగురు సోల్జర్స్ బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న బస్సును టార్గెట్ చేసుకొని టెర్రిరిస్టులు ఐఈడీని పేల్చారు. దాంతో బస్సులో ప్రయాణిస్తున్న 6గురు ఇంజనీర్లు, ఇద్దరు సోల్జర్స్ ఘటనాస్థలంలోనే మరణించినట్లు సమాచారం. పదుల సంఖ్యలో గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గాయపడిన వారిని అధికారులు ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.